ఎట్టకేలకి అంతరాష్ట్ర బస్సు సర్వీసుల మీద క్లారిటీ.. బెంగళూర్ మినహా !

-

ఎట్టకేలకి అంతరాష్ట్ర బస్సు సర్వీసుల మీద క్లారిటీ ఇచ్చారు తెలంగాణా ఆర్టీసీ అధికారులు. అంతరాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభానికి తేదీ ఖరారయింది. ఈనెల 28వ తేదీ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇక త్వరలోనే తెలుగు రాష్ట్రాలు ఆర్టీసీ అధికారుల సమావేశం అనంతరం ఏపీ తెలంగాణ సర్వీసులపై నిర్ణయం తీసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.

ఇక మహారాష్ట్ర, కర్ణాటక బస్సుల విషయంలో కర్ణాటకలో బెంగళూరు మినహా మహారాష్ట్ర ముంబై, పూణే, గుల్బర్గా , నాందేడ్, బీదర్ మార్గాల్లో తొలుత సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇవి కాక కర్ణాటకలో బెంగళూరు మినహా మిగతా సర్వీసులు ప్రారంభం కానున్నాయి. చంద్రపూర్, నాగపూర్, రాయచూర్ వంటి బిజీగా ఉండే రూట్లలో బస్సులు తిప్పనున్నారు. ఇక్కడి ఆర్టీసీ బస్సులు అక్కడికి వెళ్ళనుండగా, అక్కడి ఆర్టీసీ బస్సులు కూడా ఇక్కడికి రానున్నాయి. నిజానికి శుక్రవారం సిటీ బస్సులతోపాటే వీటిని కూడా ప్రారంభించాలని అనుకున్నా ఆ రాష్ట్రాలు నిన్నటికి సంసిద్ధంగా లేకపోవటంతో ఈ సర్వీసుల సోమవారానికి వాయిదా వేసినట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news