నేడు వికారాబాద్‌లో సీఎం కేసీఆర్ పర్యటన

-

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పలు చోట్ల పర్యటిస్తూ బిజీబిజీగా ఉండనున్నారు. ఉదయం 11 గంటలకు కేసీఆర్ హైదరాబాద్ అబిడ్స్‌లో పర్యటించనున్నారు. అక్కడ సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ముఖ్యమంత్రి వికారాబాద్ జిల్లా కేంద్రానికి బయలుదేరుతారు. వికారాబాద్‌లో ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, పూర్తైన పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.

వికారాబాద్ చేరుకున్న తర్వాత సీఎం కేసీఆర్ మొదట.. జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం మెడికల్‌ కళాశాలకు శంకుస్థాపన చేయనున్నారు. తెరాస కార్యాలయాన్ని కూడా కేసీఆర్‌ ప్రారంభిస్తారు. 61 కోట్ల రూపాయల వ్యయంతో.. సకల సౌకర్యాలతో కొత్త కలెక్టరేట్‌ను ప్రభుత్వం నిర్మించింది. మొత్తం 42 విభాగాలు ఇక్కడ నుంచి పనిచేయనున్నాయి.

ప్రారంభోత్సవ కార్యక్రమాల అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొనున్నారు. ఇందుకోసం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా శాసనసభ్యులు ఏర్పాట్లు చేశారు. సీఎం సభకు భారీగా తరలిరావాలని ప్రజల్ని కోరారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో వికారాబాద్‌లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news