తెలంగాణలో కరోనా విజృంభన.. కొత్తగా ఎన్నికేసులంటే..?

-

తెలంగాణలో కరోనా కేసులు పెరిగాయి. రోజువారీ కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల నమోదైంది. గడిచిన 24 గంటల్లో 24,686 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 247 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా హైదరాబాద్ లో నిన్న 172 కేసులు వెలుగుచూడగా నేడు హైదరాబాద్ లో 157 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 116 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.

Corona vaccination without an injection › Friedrich-Alexander-Universität  Erlangen-Nürnberg

రాష్ట్రంలో ఇంకా 1912 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటివరకు కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4,111. తెలంగాణలో నేటివరకు 7లక్షల 95వేల 819 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7లక్షల 89వేల 796 మంది కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news