బీజేపీ బుర్రలేని నిర్ణయాలే దేశంలో అలజడులకు కారణం : షర్మిల

-

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌పై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయితే తాజాగా సైనిక నియామకాల నూతన విధానం అగ్నిపథ్ తీవ్ర నిరసనలకు దారితీయడం పట్ల స్పందించారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల. బీజేపీ బుర్రలేని నిర్ణయాలు దేశంలో అలజడులకు కారణమవుతున్నాయని విమర్శించారు వైఎస్‌ షర్మిల. రాష్ట్రంలో దామెర రాకేశ్ బలయ్యాడని వైఎస్‌ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మీ నియామకాలకు అగ్నిపథ్ అగ్గిపెట్టిందని, ఆగ్రహ జ్వాలలు దేశాన్ని కాల్చేస్తున్నాయని తెలిపారు వైఎస్‌ షర్మిల.

YS Sharmila all set to Launch her New Political Party | YS Sharmila News

అయినప్పటికీ తగ్గేదేలేదంటూ నియామకాలు చేస్తామని, తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లంటూ మోదీ సర్కారు మొండిగా పోతోందని మండిపడ్డారు వైఎస్‌ షర్మిల. అగ్నిపథ్ ను వెంటనే రద్దు చేసి గతంలో మాదిరిగా నియామకాలు చేపట్టాలని స్పష్టం చేశారు వైఎస్‌ షర్మిల. పోలీసుల కాల్పుల్లో ఓ యువకుడు చనిపోయినందున, మరిన్ని అల్లర్లకు తావివ్వకుండా నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వైఎస్‌ షర్మిల.

 

Read more RELATED
Recommended to you

Latest news