Breaking : తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు..

-

యావత్తు ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 30,552 మందికి కోవిడ్ టెస్టులు చేయగా.. 658 మందికి పాజిటివ్ అని తేలింది.

Corona Virus Covid19 Illustration Stock Photo - Download Image Now - iStock

హైదరాబాద్ నగరంలో 316 పాజిటివ్ కేసులు నమోదు కాగా… రంగారెడ్డిలో 52, మేడ్చల్‌లో 41 కేసులను గుర్తించారు. ఖమ్మం జిల్లాలో 30 గుర్తించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,511 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 8,10,976 కరోనా కేసులు తెలంగాణలో నమోదు కాగా.. అందులో 8,02,354 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే.. ఇప్పటి వరకు కరోనాతో 4,111 మంది మరణించారు.

Read more RELATED
Recommended to you

Latest news