తెలంగాణలో మళ్లీ భారీగా కరోనా కేసులు..

-

ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. రోజు రోజుకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. మరో పక్క మంకీపాక్స్‌ కేసులు కూడా నమోదవుతున్నాయి. అయితే.. తెలంగాణలో కరోనా రోజువారీ కేసులు 500కి పైబడి నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 28,306 శాంపిల్స్ పరీక్షించగా, 581 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 227 కొత్త కేసులు నమోదయ్యాయి.

Corona Virus in India: देश में पिछले 24 घंटे में कोरोना के 3303 नए मामले,  एक्टिव केस बढ़कर 17 हजार हुए - corona virus in india 3303 new covid 19  cases recorded Delhi maharashtra ntc - AajTak

రంగారెడ్డి జిల్లాలో 45, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 40, పెద్దపల్లి జిల్లాలో 30, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 26, మంచిర్యాల జిల్లాలో 24, నల్గొండ జిల్లాలో 22, ఖమ్మం జిల్లాలో 20 కేసులు గుర్తించారు. అదే సమయంలో 645 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ నమోదుకాలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 8,14,884 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 8,06,207 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 4,566 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news