తెలంగాణా కరోనా : 894 కేసులు, 4 మరణాలు

-

తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గిపోయాయి. అయితే అది వైరస్ ప్రభావం తగ్గినందువలన అనుకునేరు. టెస్టులు తక్కువగా చేస్తున్నారు, సో కేసులు కూడా బాగా తగ్గాయని చెప్పాలి. గతంలో రోజుకు అరవై వేల పరీక్షల దాకా చేసే వారు. కానీ ఇప్పుడు నలభై వేల పరీక్షలు మాత్రమే  చేస్తుండడంతో కేసులు కూడా తగ్గుతున్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 24 గంటల్లో 894 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,61,728 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో నలుగురు మరణించారు. ఇప్పటి వరకు 1423 మంది కరోనాతో మరణించారు.

 

ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 12,515గా ఉన్నాయి. వారిలో 10,185 మంది హోం ఐసోలేషన్‌ లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఇప్పటి వరకు తెలంగాణలో 2,46,733 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 1,440 ( మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో రికవరీ రేటు 94.67% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 93.6% శాతంగా ఉంది. తెలంగాణలో మరణాలు 0.54%గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 39,448 పరీక్షలు చేస్తే ఇప్పటివరకు 50,50,612 పరీక్షలు చేశారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా  154 కేసులు నమోదయ్యాయి.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news