కరోనా కేసుల్లో తెలంగాణ రికార్డ్.. ఒక్కరోజులోనే..!

-

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,892 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో 8 మంది కరోనాతో మరణించారు. తాజా లెక్కలతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,462కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 10,195 మంది కోలుకోగా.. 283 మంది మరణించారు.

ప్రస్తుతం తెలంగాణలో 9,984 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కాగా, శుక్రవారం నాడు జీహెచ్ఎంసీ పరిధిలో అధికంగా 1658 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 56, మేడ్చల్‌ లో 44, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4, ఖమ్మంలో 2, వరంగల్ జిల్లాలో 41, సంగారెడ్డి జిల్లాలో 20, నల్గొండ జిల్లాల్లో 13, కామారెడ్డి జిల్లాలో 6, సిద్దిపేట జిల్లాలో 3, సిరిసిల్ల జిల్లాలో 6, నిజమాబాద్‌ జిల్లాలో 3, మహబూబాబాద్‌ జిల్లాలో 7, మెదక్‌‌ జిల్లాలో 3, వనపర్తి జిల్లాలో 5 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news