తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నేటి నుండే !

-

తెలంగాణ ఉద్యోగులకి శుభవార్త వినిపించింది తెలంగాణ సర్కార్. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ చట్టం నేటి నుంచి అమలు కానుంది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయింది. కొద్ది రోజుల క్రితం ఉద్యోగ విరమణ వయో పరిమితి పెంపు కు గవర్నర్ ఆమోదం తెలిపారు.

ఉద్యోగ విరమణ వయస్సును ప్రభుత్వం 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన బిల్లును శాసనసభ ఆమోదించింది. ఆ తరువాత బిల్లు గవర్నర్ కి చేరగా గవర్నర్ ఆమోదించారు. దీంతో గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది ప్రభుత్వం. దీంతో నేటి నుండే వయోపరిమితి పెంచారు. దీంతో ఈ నెల నెలలో రిటైర్ కావాల్సిన 770 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరింది.

Read more RELATED
Recommended to you

Latest news