BREAKING : నిజాం కాలేజీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించిన తెలంగాణ ప్రభుత్వం

-

BREAKING : నిజాం కాలేజీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్వీట్‌ చేశారు. గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న నిజాం కళాశాల డిగ్రీ విద్యార్థుల సమస్యను మానవతా దృక్పథంతో ప్రభుత్వం పరష్కరించిందని ట్వీట్‌ చేశారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

గతంలో ఎప్పుడు లేని విధంగా చరిత్రలోనే మొదటిసారిగా ముఖ్యమంత్రిగారి ఆదేశాలకు అనుగుణంగా UG విద్యార్థినులకు నిజాం కళాశాలలో హాస్టల్ వసతి కల్పించడం జరిగిందని వెల్లడించారు. ఇక తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటనతో.. విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news