దళిత బంధు లబ్దిదారులకు శుభవార్త..రూ.600 కోట్లు విడుదల

-

కేసీఆర్ సర్కార్.. దళిత బందు పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. ఒక దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకునేందుకు ఈ పథకాన్ని తీసుకు వచ్చింది ప్రభుత్వం. ప్రస్తుతం ఈ పథకం నూటికి నూరుశాతం విజయవంతంగా కొనసాగుతోంది.  అయితే.. తాజాగా దళిత బంధు లబ్దిదారులకు శుభవార్త..చెప్పింది కేసీఆర్‌ సర్కార్‌. ఈ పథకం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూ.600 కోట్లు విడుదల చేసింది.

దీంతో ఈ పథకం కింద ఇప్పటి వరకు ఎంపికైన లబ్దిదారులందరికీ.. ఎస్సీ కార్పొరేషన్‌ ఆర్థిక సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేటగిరిల్లో ఇప్పటి వరకు 38,476 మంది లబ్ది దారులు ఈ పథకం కింద ఎంపికయ్యారు. ప్రస్తుతం ఎంపికైన లబ్దిదారుల ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.3887 కోట్ల ప్రభుత్వం జమ చేసింది. ఇక ఇప్పటికే మంజూరైన దళిత బంధు యూనిట్లకు తాజాగా రూ.600 కోట్లు రిలీజ్‌ చేయడంతో బకాయిలన్నీ.. చెల్లించేందుకు నిధులు అందుబాటులోకి వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news