జగన్‌ అక్రమాస్తుల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశం..!

-

జగన్‌ ఆస్తుల కేసుల్లో ఛార్జ్‌షీట్‌లపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది..నాంపల్లి కోర్టులో ఉన్న ఒక ఈడీ ఛార్జిషీట్‌ను కూడా సీబీఐ కోర్టుకే బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశించింది..జగన్‌ ఆస్తుల కేసులపై సీబీఐ ఛార్జిషీట్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నాంపల్లి మెంట్‌ సీబీఐ కోర్టులో ఆరు ఛార్జిషీట్లు, నాంపల్లి మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టులో ఒక ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.. ఐతే సీబీఐ కోర్టులో ప్రధాన కేసులు పెండింగ్‌లో ఉన్నందున నాంపల్లి కోర్టులో పెండింగ్‌లో ఉన్న అరబిందో, హెటిరో భూ కేటాయింపులకు సంబంధించిన ఈడీ కేసు కూడా అక్కడికే బదిలీ చేయాలని జగతి పబ్లికేషన్స్‌ కోరింది.

జగతి పబ్లికేషన్స్‌ వినతిని నాంపల్లి కోర్టు నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం,అన్నీ ఒకే చోట విచారణ జరిపేందుకు వీలుగా అరబిందో, హెటిరో ఈడీ కేసు కూడా సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఈనెల 30న నాంపల్లి కోర్టులో కేసు విచారణ ఉన్నందున ఆ రోజు బదిలీ ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది.

Read more RELATED
Recommended to you

Latest news