Breaking : ఫిబ్రవరి 6న ఎమ్మెల్యేలకు ఎర కేసులో తీర్పు

-

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఈ నెల 6న హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇవ్వగా.. ఈ తీర్పును ప్రభుత్వం ధర్మాసనం వద్ద అప్పీల్ చేసింది. సుదీర్ఘ వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం.. ఈ మేరకు సోమవారం ఉదయం 10.30 గంటలకు తీర్పు వెల్లడించనుంది. ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తు పట్ల నమ్మకం లేదని బీజేపీ, నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజి వేసిన పిటిషన్లు పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం..ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కేసును సీబీఐకి అప్పగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని సిట్‌ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో పురోగతి ఉన్నందున సిట్‌తో దర్యాప్తు చేయించాలని ఆయన కోరారు. అయితే, అడ్వకేట్‌ జనరల్‌ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తు వివరాలను సీబీఐకి అందజేయాలని సిట్‌ను ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news