BERAKING NEWS : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్ కౌంటర్… ఆరుగురు మావోయిస్టుల మృతి.

-

ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఒక్కసారిగా అలజడి రేగింది. తెలంగాణ ప్రాంతంలో దాదాపుగా మావోయిస్టుల కదలికలు తగ్గిన క్రమంలో మరోసారి ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. తెలంగాణ, చత్తీస్ గడ్ సరిహద్దుల్లో ఎన్ కౌంటర్ జరిగింది. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న కుంట-చర్ల ఏరియాలోని పెసలపాడు అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.  ఆదివారం రాత్రి నుంచి ఇటు తెలంగాణ గ్రేహౌండ్స్, అటు మావోయిస్టుల మధ్య తీవ్ర ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.

ఎన్ కౌంటర్ లో దాదాపు 6 మంది మావోయిస్టులు మరణించారని తెలుస్తోంది. అయితే అధికారులు ఇంకా మావోయిస్టుల మృతిని ధ్రువీకరించాల్సి ఉంది. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.  గ్రేహౌండ్స్ పక్కా సమాచారంలో ఈ ఆపరేషన్ జరిగింది. మావోయిస్టులు ఉన్నారనే సమాచారంలో గ్రేహౌండ్స్ దళాలు కుంట ఏరియాలో అటవీ ప్రాంతాన్ని చుట్టు ముట్టినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే మావోయిస్టులకు, గ్రేహౌండ్స్ దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news