ఈటల ఆ విషయం గుర్తుంచుకొని స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలి : ప్రశాంత్‌ రెడ్డి

-

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. స్పీకర్ ను ఉద్దేశిస్తూ ఈటల చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డికి ఈటల బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే సభ నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.

స్పీకర్ నిబంధనల మేరకు తన బాధ్యతలను చక్కగా నిర్వహిస్తున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. సభ్యుల సంఖ్యను బట్టి బీఏసీలో పార్టీలకు అవకాశం ఇవ్వాలని గతంలోనే నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా బీజేపీకి బీఏసీలో అవకాశం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని  ప్రశాంత్ రెడ్డి సూచించారు.

బీజేపీకి భయపడి అసెంబ్లీ నిబంధనలు మారుస్తామా అని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ స్పీకర్ సీఎం కనుసన్నల్లో వ్యవహరిస్తే.. మరి లోక్‌సభ స్పీకర్ ప్రధాని మోదీ కనుసన్నల్లో వ్యవహరిస్తున్నారా? అని ఈటలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news