నేడు మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

-

ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నిక జరగనుంది. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీగా ఆయన రాజీనామా చేశారు. ఈ తరుణంలో మహబూబ్నగర్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది.

Mahbubnagar local body MLC by-election today

ఇక ఇవాళ ఉదయం 8 గంటల ప్రాంతం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. 1439 ఓటర్ల కోసం జిల్లాలో 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. వచ్చేనెల రెండవ తేదీన ఈ ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇక ఈ పోటీలో బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మన్నే జీవన్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ ఉన్నారు. ఈ సందర్భంగా 1,439 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు వేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news