మంత్రాల నేపథ్యంలో మహిళ దారుణ హత్య..!

-

ప్రస్తుతం రోజు రోజుకు  టెక్నాలజీ పెరిగిపోతుంది. కొంత మంది అంతరిక్షంలో అడుగులు వేస్తున్న ఈ కాలంలో మూఢనమ్మకాలు, మంత్రాల నేపథ్యంలో ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బోర్గం గ్రామంలో చంద్రకళ అనే మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్లితే..  నవీపేట్ మండలం కోడ్లీ గ్రామ శివారులోని అలీసాగర్ లిఫ్ట్ కెనాల్ లో గుర్తుతెలియని మహిళ మృతదేహం ఉందనే సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లారు. పంచనామ అనంతరం దర్యాప్తు చేయగా.. సదరు మహిళ రెంజల్ మండలం బోర్గం గ్రామానికి చెందిన చంద్రకళగా గుర్తించారు. తలపై గాయం ఉండడంతో అనుమనదాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా రెంజల్ మండలం బోర్గం గ్రామానికి చెందిన మృతురాలు మంగళి చంద్రకళ మంత్రాలు చేస్తున్నదనే నేపథ్యంలో హత్య చేసి కోహ్లి కెనాల్ లో పడేశారని ప్రాథమిక అంచనాకు వచ్చారు. నిందితులు మృతురాలికి రూ.50 వేల బాకీ ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది. నిందితులు ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news