దుర్గాదేవి నిమజ్జనంలో అపశృతి.. ప్రమాదవశాత్తు చెరువులో పడ్డ యువకుడు

-

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు హిమాయత్ సాగర్ చెరువు లో యువకుడు గల్లంతయ్యడు. దుర్గాదేవి నిమజ్జనం నేపథ్యంలో ప్రమాదవశాత్తు చెరువులో పడ్డాడు యువకుడు శ్రీకాంత్. శ్రీకాంత్ ను కాపాడే ప్రయత్నం చేసాడు అతడి అన్న, కానీ అప్పటికే నీట మునిగాడు శ్రీకాంత్. దుర్గామాత విగ్రహం మీద పడడంతో మునిగిపోయాడు యువకుడు. హుటాహుటిన సాగర్ వద్దకు చేరుకున్న పోలీసులు, గజ ఈతగాళ్ళు శ్రీకాంత్ మృతదేహాన్ని బయటకు తీశారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రాజేంద్రనగర్ పోలీసులు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఇంట్లో దుర్గా మాత ను ప్రతిష్టించారు శ్రీకాంత్ కుటుంబ సభ్యులు. ఐదు రోజుల పూజ ఆనంతరం దుర్గా మాతను రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్‌ లో నిమజ్జనం చేయడానికి వచ్చారు అన్నదమ్ములు. నిమ్మజనం చేస్తుండగా కాళు జారీ చేరువులో పడ్డాడు శ్రీకాంత్. అతని పై విగ్రహం పడడంతో నీట మునిగాడు. కాపాడే ప్రయత్నం చేసాడు అన్న.. కానీ ఇద్దరికి ఈత రాకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు శ్రీకాంత్.

Read more RELATED
Recommended to you

Latest news