రాజగోపాల్, ఈటెల వ్యాపార బానిసలు – అద్దంకి దయాకర్

-

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటెల రాజేందర్ వ్యాపార బానిసలు అని అన్నారు పీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడడం బాధాకరం, నష్టమేనని అన్నారు. ఈటెల రాజేందర్ అస్తిత్వం కాపాడుకునే పనిలో పడ్డారని అన్నారు అద్దంకి దయాకర్. ఈటెల సహజ గుణం కోల్పోయాడన్నారు. బిజెపి, టిఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ నేతలే దిక్కు అయ్యారని అన్నారు.

టిఆర్ఎస్ పార్టీ నుంచి ఈటెల రాజేందర్ ని తరిమేస్తే కాంగ్రెస్ లో చేరడానికి రాలేదా? అంటూ ప్రశ్నించారు. బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మోడీ మోకమే నెగిటివ్ గా మారిందన్నారు అద్దంకి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. సోనియా గాంధీ నియమించిన వ్యక్తే కదా రేవంత్ రెడ్డి.. మరి ఇన్నాళ్లు ఎందుకు మాట్లాడలేదన్నారు. ఇప్పుడు రేవంత్ పై పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news