హైదరాబాద్ లో రహస్యంగా పర్యటించిన అజిత్ డోభాల్

-

హైదరాబాద్ లో రహస్యంగా పర్యటించారు జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన పర్యటన సాంతం రహస్యంగా జరిగింది. ఎలాంటి భద్రతా హడావుడి లేకుండా సాధారణ పౌరుడిగా ఓ చిన్న కారులో హైదరాబాదులో ప్రయాణించారు. కొందరు కీలక వ్యక్తులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయినట్లు తెలిసింది.

సుమారు మూడు గంటల పాటు ఆయన హైదరాబాదులో ఉన్నారు. ఆ వెంటనే ప్రత్యేక విమానంలో ఢిల్లీ తిరిగి వెళ్లారు. ఆయన పర్యటన పై రాష్ట్ర పోలీసులకు, నిఘా విభాగానికి ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. అంత గోప్యంగా ఆయన పర్యటన జరిగిందంటే, ఏదైనా బలమైన కారణం ఉండే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. డోబాల్ ఏది చేసినా ప్రత్యేకమే. దాయాది దేశం పాకిస్తాన్ లో ఆయన ఎంతో కాలం రహస్యంగా ఉన్నారు. మారువేషాల్లో, చివరకు బిక్షగాడి వేషంలోనూ గూడచర్యం చేసిన డోబాల్ భారత్ కు కీలక సమాచారం చేరవేశారు.

Read more RELATED
Recommended to you

Latest news