సంప్రదాయాలతో నిండిన తెలంగాణకు మీలో ప్రతీ ఒక్కరికీ స్వాగతం : సీఎం రేవంత్ రెడ్డి

-

వేల సంవత్సరాల నాటి చరిత్ర.. సంస్కృతి, సంప్రదాయాలతో నిండిన తెలంగాణకు మీలో ప్రతీ ఒక్కరికీ స్వాగతం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్కు వద్ద టూంబ్స్‌ను సందర్శించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఆగాఖాన్ ట్రస్ట్ కల్చర్ ఆధ్వర్యంలో జరుగుతున్న పునరుద్దరణ ప్రాజెక్ట్ ముగింపు కార్యక్రమంలో అందరితో కలిసి పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

శాతావాహనులు, కులీ కుత్ బ్ షాహీలు, ఇతరులు ఈ ప్రాంతాన్ని పరిశీలించాలని తెలిపారు. చార్మినార్, గోల్కొండ కోట, కుత్ బ్ షాహీ సమాదులు, వేయి స్థంబాల గుడి, రామప్ప, అలంపూర్ వంటి దేవాలయాల వంటి నిలయాలు వాస్తు అద్భుతాలను తెలంగాణ నిలయంగా ఉందన్నారు. శతాబ్దాలుగా హైదరాబాద్ గంగా-జమునా తెహజీబ్ గా పిలువబడుతూ.. బహుళ జాతుల సంస్కృతుల సామరస్యాన్ని సహజీవనాన్ని చూసిందన్నారు. కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్కు, సెవెట్ టూంబ్స్ ఔట్స్ షాహిన్ రాజవంశం నైపుణ్యానికి గొప్పతనంగా నిలుస్తాయన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news