మంత్రులంతా ఊర కుక్కల్లా మాట్లాడుతున్నారు – మాజీ ఎంపీ పొన్నం

-

రైతులకు ఉచిత విద్యుత్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని సృష్టిస్తున్న నేపథ్యంలో తాజాగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పందించారు. మంగళవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్ అంశంపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బిఆర్ఎస్ నేతలు వక్రీకరించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే రైతులు.. రైతులు అంటేనే కాంగ్రెస్ అని స్పష్టం చేశారు.

రైతులకు అనుకూలంగా పనిచేసిన పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ మంత్రులంతా ఊర కుక్కల్లా మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ కొనుగోలు విషయంలో జరిగిన అవినీతిపై రేవంత్ రెడ్డి మాట్లాడితే ఆయన మాటలను వక్రీకరిస్తున్నారని అన్నారు. విద్యుత్ కొనుగోలు అవినీతిపై బహిరంగ చర్చకు బిఆర్ఎస్ పార్టీ నేతలు సిద్ధమా..? అంటూ సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news