అమిత్ షా రేపటి తెలంగాణ పర్యటన రద్దు..!

-

తెలంగాణకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జనవరి 28న తెలంగాణలో పర్యటిస్తారని గత రెండు మూడు రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన రద్దు అయినట్టు ఓ ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు,  కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి తాజాగా  హైదరాబాదులో  ప్రకటన విడుదల చేశారు. బీహార్ పరిణామాలతో తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. కరీంనగర్, మహబూబ్ నగర్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమీక్షించాలనుకున్నారు. కానీ కొన్ని అత్యవసర పనుల వల్ల రాష్ట్రంలో కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారి పర్యటన వాయిదా పడింది. దీంతో  కరీంనగర్, మహబూబ్ నగర్,హైదరాబాద్ సమావేశాలు వాయిదా వేయడం  జరిగిందని కిషన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news