ఈరోజు రాత్రి అప్సర హత్య కేసు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌

-

హైదరాబాద్ సరూర్​నగర్​లో అప్సర అనే మహిళ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేసిన అప్సరను కిరాతకంగా హతమార్చిన ఘటనలో నిందితుడు సాయికృష్ణను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా కోర్టు రెండ్రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలో శంషాబాద్‌ పోలీసులు సాయికృష్ణను ఇవాళ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. ఈరోజు రాత్రి నిందితుడిని హత్య జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లి సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేయనున్నారు. దీని ద్వారా అప్సర హత్యకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించనున్నారు. శనివారం మధ్యాహ్నంతో సాయికృష్ణ కస్టడీ ముగియనుంది.

అప్సరతో సాయికృష్ణకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసిందని గతంలోనే పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే. ఆమె గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలంటూ అతడిపై ఒత్తిడి తెచ్చిందని.. విషయం బయటపడితే తన పరువు పోతుందనే భయంతో ఆమెను సాయికృష్ణ హతమార్చాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని మ్యాన్‌హోల్‌లో వేసి పూడ్చేసి.. ఆపై ఏమీ తెలియనట్టు ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news