జీవన్ రెడ్డి హత్య కుట్రకు నిరసనగా ఆర్మూర్ బంద్

-

ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్య కుట్రకు నిరసనగా టీఆర్ఎస్ నేతలు నేడు ఆర్మూర్ నియోజకవర్గ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వ్యాపార సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు స్వచ్ఛందంగా బంద్ ను పాటిస్తున్నాయి. ఇటీవల తనపై హత్యకు కుట్ర జరిగినట్లు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

నిజామాబాద్‌‌ జిల్లా మాక్లూర్ మండలం కల్లెడ సర్పంచ్ లావణ్య భర్త ప్రసాద్ గౌడ్ తన హత్యకు ప్లాన్‌‌ చేశారని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, ప్రసాద్‌‌గౌడ్‌‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బుల్లెట్లులేని ఒక నాటుతుపాకీ, పెల్లెట్లు ఉన్న ఒక ఎయిర్‌‌ పిస్టల్, కత్తి స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారా హిల్స్‌‌ రోడ్‌‌ నంబర్ 12లో వేమూరి ఎన్‌‌క్లేవ్‌‌లో జీవన్‌‌రెడ్డి నివాసం ఉంటున్నారు. కల్లెడ సర్పంచ్‌‌ లావణ్య కుటుంబంతో కొంతకాలంగా ఆయనకు రాజకీయ విభేదాలున్నాయి. లావణ్యపై వచ్చిన అవినీతి ఆరోపణలతో పంచాయతీరాజ్‌‌ అధికారులు ఆమెను 6నెలల సస్పెండ్‌‌ చేశారు.

దీనికి కారణం జీవన్‌‌ రెడ్డి అని అనుమానంతో ఆమె భర్త ప్రసాద్‌‌గౌడ్‌‌ ఎమ్మెల్యేపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జీవన్‌‌రెడ్డి ఇంటికి వెళ్లాడు. జీవన్‌‌ రెడ్డిని కలవాలంటూ సెక్యూరిటీకి చెప్పాడు. ఎమ్మెల్యే థర్డ్‌‌ ఫ్లోర్‌లో ఉన్నారని, వచ్చే వరకు వెయిట్‌‌చేయాలని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు.

సెక్యూరిటీ చెప్పిన ప్రకారం ప్రసాద్‌‌ గౌడ్‌‌ కొద్దిసేపు హాల్‌‌లో వెయిట్‌‌ చేశాడు. 8.15 గంటల సమయంలో లిఫ్ట్‌‌లో మూడో అంతస్తుకు వెళ్లాడు. ఇది గమనించిన జీవన్‌‌ రెడ్డి ఎందుకు వచ్చావంటూ ప్రశ్నించారు. సెక్యూరిటీ గార్డులతో ప్రసాద్​ను బయటకు పంపించారు. ఈ క్రమంలోనే గన్‌‌మెన్​తో ప్రసాద్‌‌ను చెక్‌‌ చేయించగా ఎయిర్‌‌గన్​ బయటపడింది. బంజారాహిల్స్​ పోలీసులు ప్రసాద్‌‌ కారును తనిఖీ చేయగా మరో ఎయిర్‌గన్‌‌ దొరికింది. ప్రసాద్‌‌గౌడ్‌‌ను ముందుగా టాస్క్‌‌ఫోర్స్ ఆఫీస్‌‌కు తరలించారు. నేపాల్‌‌ వెళ్లి గన్‌‌ కొనుగోలు చేసినట్లు అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news