BREAKING : రేపటి నుంచి ఆషాడ బోనాలు షురూ

-

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 22వ తేదీ నుంచి, అంటే రేపటి నుంచే ఆషాడ బోనాలు షురూ కానున్నాయి. మొట్టమొదటగా గోల్కొండ బోనాలు ప్రారంభం కానున్నాయి. లంగర్ హౌస్ లో నిర్వహించే, గోల్కొండ బోనాల తొట్టెల ఊరేగింపు లో పాల్గొననున్నారు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ.

ఇక ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు మంత్రులు. లక్షలాదిగా వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఏర్పాట్లపై వివిధ శాఖ అధికారులతో సమీక్షలు జరిపారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. ఆషాడ బోనాల ఉత్సవాలతో నెల రోజులపాటు సందడిగా మారనున్నాయి జంట నగరాలు.

Read more RELATED
Recommended to you

Latest news