నేడు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం

-

హైదరాబాద్​లో ప్రసిద్ధి గాంచిన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవం కన్నుల పండువగా సాగనుంది. ఇవాళ జరగనున్న ఈ వేడుకకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ ఏర్పాట్లను మంత్రి తలసాని పరిశీలించారు.  ఇవాళ కల్యాణం.. రేపు రథోత్సవం జరగనుందని మంత్రి వెల్లడించారు. అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా.. అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రతి సంవత్సరం లాగే వివిధ శాఖల ఆధ్వర్యంలో.. పకడ్బందీగా ఏర్పాట్లును పర్యవేక్షిస్తూ.. కల్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి వివరించారు.

గత సంవత్సరం ఉత్సవాలకి 8 లక్షల మంది భక్తులు వచ్చారని.. ఈ ఏడాది దాదాపుగా 15 లక్షల వరకు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. గతంలో అతికొద్ది మంది సమక్షంలో జరిగే ఈ వేడుక.. ప్రస్తుతం కొన్ని లక్షల మంది మధ్య జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలందరూ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించే విధంగా ఆలయం సమీపంలో ఎల్‌ఈడీ స్క్రీన్‌లను సిద్ధం చేశామని తలసాని శ్రీనివాస్​ యాదవ్ వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news