రాముడిని హేళన చేస్తే చూస్తూ ఊరుకోం – బండి సంజయ్ హెచ్చరికలు

-

రాముడిని హేళన చేస్తే చూస్తూ ఊరుకోబోమని కాంగ్రెస్ నాయకులకు బండి సంజయ్ హెచ్చరిక జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో బండి సంజయ్‌ మాట్లాడుతూ… నన్ను బిచ్చగాడు అని అంటున్నారు. అవును బరాబర్ నేను బిచ్చగాడినే. నేను ఓట్లు అడుక్కుంటున్నా. వాళ్ళలాగా ఓట్లు కొనాలనుకుంటలేను. బండి సంజయ్ ఏం చేసిండని అడుగుతున్నారు. ₹12 వేల కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన. పోరాటాలు చేసిన. ప్రజల కోసం పనిచేసిన. కరోనా వచ్చినప్పుడు చావుకు తెగించి, కరోనా వార్డులోకి వెళ్లి రోగులకు భరోసా కల్పించినట్లు తెలిపారు.

bandi sanjay in husnabad

వైద్యులు, సిబ్బందికి అండగా నిలిచిన. ఇప్పుడున్న కాంగ్రెస్, బిఆర్ఎస్ అభ్యర్థులతో పాటు స్థానిక మంత్రి ఎక్కడికి పోయారు? మీ అందరి కోసం కొట్లాడింది నేను. ఓడినా, గెలిచినా వినోద్ రావుకు కరీంనగర్ గుర్తుకురాదు. నా మీద పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ కు డిపాజిట్ కూడా నాడు రాలేదు. అతనిని మళ్లీ ఎలా గెలిపించారో మీకే తెలియాలి. గౌరవెల్లి బాధితుల కోసం అండగా నిలిచి, అర్ధరాత్రి వారికోసం వచ్చి పోరాటం చేశాను. మరి ఆ సమయంలో మంత్రి ఎక్కడ ఉన్నాడు? అని నిలదీశారు.
కాంగ్రెస్, బిఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే వందల కోట్ల నుండి వేల కోట్లు సంపాదిస్తారు. నేను గెలిస్తే నాపై వేల కేసులు పెట్టినా భరించేందుకు సిద్ధంగా ఉన్నాను. కాబట్టి 13వ తేదీన బ్యాలెట్ బాక్స్ లో ఒకటో నెంబర్ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలని ప్రజలందరినీ కోరుతున్నానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news