కొత్త సచివాలయంలో సీఎం సీటుపై శాశ్వతంగా దళితుడి కూర్చోబెట్టే దమ్ముందా? – బండి సంజయ్

-

 

 

దమ్ముంటే దళితుడిని సీఎంను చేసి మాట నిలబెట్టుకో…కొత్త సచివాలయంలో సీఎం సీటుపై శాశ్వతంగా దళితుడి కూర్చోబెట్టే దమ్ముందా? అని ప్రశ్నించారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.దళితులందరికీ 3 ఎకరాల భూమిని పంపిణీ చెయ్…దళిత బంధు పథకాన్ని దళితులందరికీ వర్తింపచేయాలనీ డిమాండ్ చేశారు. ఏటా 1.25 లక్షల మంది దళితులను పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్న ఘనత బీజేపీదేనన్నారు.

 

దళితులకు బీజేపీ ఏం చేసిందో చర్చించేందుకు సిద్ధం అని కుండబద్దలు కొట్టారు తెలంగాణ చరిత్రను తెరమరుగు చేసేందుకే జాతీయ సమైక్యత దినోత్సవాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

 

తెలంగాణను పాకిస్తాన్ లో కలపాలన్న రజాకార్ పార్టీ వారసులతో కుమ్కక్కుఅయ్యారని…విమోచన దినోత్సం జరిపితే హిందువులను వ్యతిరేకించినట్టా? అని ప్రశ్నించారు.సమైక్యత దినోత్సవం జరిపితే ముస్లిం లను గౌరవించినట్టా కేసీఆర్..?నిజాం చెర నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించిన మహనీయుడు పటేల్ అన్నారు. జాతీయ సమైక్యత దినం కి అర్ధం లేదు పర్థం లేదని విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news