మోడీని విమర్శించే కేసీఆర్ కు సిగ్గుండాలి – బండి సంజయ్

-

నిన్న వికారాబాద్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీపై సీఎం కేసీఆర్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై సీఎం కేసీఆర్కు బండి సంజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు.
ఇక్కడ కేసీఆర్ వారసుడు(ఎర్రబెల్లి దయాకరరావు) ఒకడున్నాడు కదా అని ఫైర్ అయ్యారు. మోడీని విమర్శించే కేసీఆర్ కు సిగ్గుండాలి..తెలంగాణ సీఎం కేసీఆరా…? మోడీనా..? అని నిప్పులు చెరిగారు.

మోదీ మంజూరు చేసిన ఇళ్లను ఎందుకు కట్టించడం లేదు? మోడీ ఇచ్చిన ఇండ్లను కట్టిస్తే… పేదలు ‘పువ్వు గుర్తు’కు ఓటు వేస్తారనే భయంతోనే కేసీఆర్ కట్టించడం లేదని వెల్లడించారు. ఈ 8 ఏళ్ల పాలనలో పేదోళ్లకు ఇండ్లు ఇవ్వని కేసీఆర్… తాను మాత్రం 8 నెలల్లో 100 రూములతో ఇండ్లు కట్టుకున్నాడనీ ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్ కుమార్. ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్… తన ఇంట్లో మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకుండు…అన్నీ మోడీ ఇస్తుంటే… ఇక కెసిఆర్ ఇస్తున్నదేంటి? అని ప్రశ్నించారు. ఏమీ ఇవ్వకుండా… మోదీ ని విమర్శిస్తాడా ? అని రివర్స్ అటాక్ చేశారు బండి సంజయ్ కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news