ఒడిషాలో బీఆర్‌ఎస్‌ కు బిగ్‌ షాక్‌..పలుగురు నేతలు రాజీనామా !

-

 

ఒడిషాలో బీఆర్‌ఎస్‌ కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఒడిషా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో ఇటీవల కాలంలోనే చేరిన నేతలందరూ పార్టీని వీడుతున్నారు. ఒక్కొక్కరు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న BRS అగ్ర నాయకత్వం నుంచి ఎలాంటి కార్యక్రమాలు లేకపోవడంతో అసహనంలో ఉన్నారు ఒడిషా నేతలు.

ఇక ఇటీవలే కారు దిగాలని మాజీ సిఎం తనయుడు శశిర్ గమాంగ్ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా జై రాం పంగి కూడా బీఆర్ఎస్ ను వీడాలని నిర్ణయం తీసుకున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీని వీడిన వీరంతా త్వరలో కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లేందుకు సిద్ధం అయ్యారట. కాగా బీఆర్‌ఎస్‌ పార్టీ కేవలం మహారాష్ట్రలో ఎక్కువగా ఫోకస్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version