బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావుకు కరోనా పాజిటివ్

-

కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత రోజుకో రూపం సంతరించుకొని మానవాళిని భయపెడుతూనే ఉంది. గత కొన్ని నెలలుగా తగ్గినట్లే తగ్గిన కోవిడ్ వ్యాప్తి.. కొత్త వేరియంట్ తో మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో మళ్ళీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ.. ఫోర్త్ వేవ్ ముంగిట ఉన్నామా అనిపిస్తుంది. తాజాగా సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు.

సోమవారం క్యాంపు కార్యాలయంలో తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఎమ్మెల్యే రఘునందన్ రావుకు ఏరియా ఆసుపత్రి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. ఆయన వారం రోజులపాటు హోమ్ క్వారంటెయిన్ లో ఉండాలని వైద్యులు సూచించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇటీవల పలు గ్రామాల్లో పర్యటించిన సందర్భంగా తనని కలిసిన కార్యకర్తలు, ప్రజలు కరుణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news