బిజెపి టిఆర్ఎస్ రెండు తోడుదొంగలే – చిన్నారెడ్డి

-

బిజెపి, టిఆర్ఎస్ రెండూ తోడుదొంగలేనని అన్నారు మాజీ మంత్రి చిన్నారెడ్డి. బండి సంజయ్ మాటలు చాలా హాస్యస్పదంగా ఉన్నాయన్నారు. అవినీతికి పాల్పడిన వారిని మెము అధికారంలోకి వచ్చిన తర్వాత జైల్లో పెడతామని బండి సంజయ్ చెపుతున్నారునీ.. అసలు బిజెపి తెలంగాణలోకి అధికారంలోకి రావడం పగటి కలే అన్నారు. అవినీతి చేసిన వారిపై సిబిఐతో ఎంక్వయిరీ వేయించండి.. అప్పుడు ప్రజలు నమ్ముతారని అన్నారు చిన్నారెడ్డి.

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీకి రాజగోపాల్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజగోపాల్ రెడ్డి చిత్తశుద్ధి ఏంటో అర్థం అవుతుందన్నారు. రాజగోపాల్ రెడ్డి బిజెపికి ఎందుకు వెళ్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు చిన్నారెడ్డి. కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డికి అన్ని పదవులు ఇచ్చిందన్నారు. 5వ తేదీన మునుగోడులో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. మునుగోడు లో కాంగ్రెస్ కార్యకర్తలు ఆధార్యపడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news