BREAKING : పాతబస్తీలో కలకలం..చార్మినార్‌కు బాంబు బెదిరింపు

-

చార్మినార్ దగ్గర బాంబు పెట్టినట్టుగా అగంతకులు బెదిరింపులు పాల్పడ్డారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. చార్మినార్ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. చార్మినార్ పరిసరాల్లో దాదాపు గంట సేపటి నుంచి బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు. చార్మినార్ దగ్గర ఫుట్ పాత్ లపై షాపులను కూడా తొలగించారు.

ఇదిలా ఉంటే, నవంబర్ 15వ తేదీ రాత్రి హైదరాబాద్ సంతోష్ నగర్ క్రాస్ రోడ్ లో బాంబు పెట్టినట్లు పోలీస్ కంట్రోల్ రూమ్ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో వెంటనే పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, పోలీసు అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే తనిఖీల అనంతరం అది ఫేక్ కాల్ అని పోలీసులు నిర్ధారించారు.

Read more RELATED
Recommended to you

Latest news