కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీఆర్ఎస్, బీజేపీ ప్లాన్.. ఎమ్మెల్యే యెన్నం ఆసక్తికర వ్యాఖ్యలు

-

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీఆర్ఎస్, బీజేపీ ప్లాన్ చేస్తున్నాయని కాంగ్రెస్  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాత మాట్లాడారు.ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడంతో.. ఎలాగైనా అధికారంలోకి రావాలని.. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ ప్రలోభాలకు తలొగ్గకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేది లేదని తేల్చి చెప్పారు.

ఎవరు ఏం చేసినా రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారని.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే శ్రీరామ రక్ష అని స్పష్టం చేశారు.  పదేళ్ల పాటు అధికారం అనుభవించిన బీఆర్ఎస్ ప్రతిపక్షంలో మనుగడ సాధించలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యెన్నం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను యెన్నం మహబూబ్ నగర్ లో ఓడించారు.

Read more RELATED
Recommended to you

Latest news