బీఆర్ఎస్ పొత్తు మాతో కాదు.. కాంగ్రెస్‌తోనే : చేవెళ్ల ఎంపీ

-

తెలంగాణలో ప్రస్తుతం కవిత బెయిల్ అంశం హాట్ టాపిక్ అవుతోంది. కవితకు బెయిల్ రావడానికి బీజేపీనే ప్రధాన కారణమని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని, అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ లో బీజేపీ అభ్యర్థికి కారు పార్టీ నేతలు మద్దతు తెలిపారని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే కవితకు బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఆరోపిస్తుండగా..

చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి దీనిపై తాజాగా స్పందించారు. బీజేపీ సహకారంతో సుప్రీంకోర్టు కవితకు బెయిల్ ఇవ్వలేదని, సుప్రీం తీర్పుపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న కామెంట్స్ అసమంజమైనవని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ ఎన్నిటికీ బీఆర్ఎస్‌తో కలవదని స్పష్టంచేశారు. గతంలో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారని,ఇప్పుడు అదే హస్తం కండువా కప్పుకుని ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్,బీఆర్ఎస్ మధ్య గతంలో పొత్తు నడిచిందని కూడా ఎంపీ కొండా గుర్తుచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news