జమిలీ ఎన్నికల పేరుతో కేంద్రం కుట్రలు చేస్తోంది – గుత్తా సుఖేందర్ రెడ్డి

-

తెలంగాణలో ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిసెంబర్ లోగా ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. జమిలి ఎన్నికల పేరుతో కేంద్రం కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం చేస్తున్న హడావిడితో దేశవ్యాప్తంగా ప్రజల్లో గందరగోల పరిస్థితి నెలకొందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కేంద్ర ప్రభుత్వం సజావుగా సాగించే పరిస్థితి లేదన్నారు.

అన్ని మార్గాలను ఉపయోగించి తిరిగి కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావాలని చూస్తుందన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. జనవరి 16 లోపు తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతాయని.. మూడోసారి కూడా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు గుత్తా సుఖేందర్ రెడ్డి.

వైఎస్ షర్మిల లాంటి సమైక్యవాదులు రాష్ట్రంలో చొరబడ్డారని అన్నారు. కాంగ్రెస్ నేతలకు స్వప్రయోజనాలే ముఖ్యమని.. నల్లగొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జానారెడ్డి లవి ముగ్గురివి మూడు దారులని ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి సగం శరీరం బిజెపి లోనే ఉందని సెటైర్లు వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news