రామోజీరావుతో చంద్రబాబు ఏకాంత చర్చలు.. ఫిలిం సిటీలో 4 గంటల పాటు !

-

ఏపీ రాజకీయాలు రోజురోజుకు హాట్ హాట్ గా మారుతున్నాయి. తాజాగా ఈనాడు అధినేత రామోజీరావు తో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమావేశం అయ్యారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో రామోజీరావు తో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు.

నిన్న సాయంత్రం నాలుగు గంటలకు రామోజీ ఫిలిం సితీలోకి వెళ్లిన నారా చంద్రబాబునాయుడు మళ్ళీ రాత్రి 8 గంటల తర్వాత బయటకు వచ్చారు. దాదాపు నాలుగు గంటల పాటు వీరి మధ్య కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరూ ఏపీ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం అందుతుంది. దీనిపై మీడియాతో చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యాఖ్యలు గానీ ప్రకటన గాని చేయలేదు.

Read more RELATED
Recommended to you

Latest news