బ్రేకింగ్‌ : ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి కెసిఆర్ భేటీ

-

దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో తెలంగాణ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు భేటీ అయ్యారు. కాసేపటి క్రితమే… ప్రధాని నరేంద్ర మోడీ ఇంటికి వెళ్లిన సీఎం కేసీఆర్‌… ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోడీ తో సీఎం కేసీఆర్‌ చర్చించే అవకాశం ఉంది.

అలాగే తెలంగాణ రాష్ట్రానికి పెండింగ్‌ నిధులతో పటు కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌ పై ఈ సమావేశం లో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ నెల 1 వ తేదీన ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్‌… నిన్న మధ్యాహ్నం 1: 48 గంటలకు వసంత్‌ విహార్‌ లో తెలంగాణ భవన్‌ నిర్మానానికి భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా… రేపు హొం మంత్రి అమిత్‌ షా తో కేసీఆర్‌ భేటీ కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news