రేపు హైదరాబాద్ కి సీఎం జగన్.. కేసీఆర్ తో భేటీ..!

-

ఏపీ సీఎం జగన్ రేపు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించనున్నారు. ఇటీవల కేసీఆర్ ఎడమతుంటికి ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన హైదరాబాద్ నందినగర్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ రేపు ఆయనను పరామర్శించనున్నారు. 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ విజయం తర్వాత జగన్ నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

అనంతరం కేసీఆర్ జగన్ ప్రమాణస్వీకారానికి కూడా హాజరయ్యారు. అయితే.. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ ను తొలిసారి కలవనున్నారు జగన్. తెలంగాణలో పార్టీ పెట్టిన జగన్ సోదరి షర్మిల రేపు ఆ పార్టీని కాంగ్రెస్ ను విలీనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం, తెలంగాణ మాజీ సీఎం భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని బీఆర్ఎస్, వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news