BREAKING : ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ ధర్నా.. పాల్గొన్న సీఎం కేసీఆర్‌, రాకేష్‌ టికాయత్‌

-

యాసంగి కాలంలో… తెలంగాణ రాష్ట్ర రైతులు పండించే ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని.. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఉగాది పండుగ రోజు మరుసటి నుంచి.. టీఆర్‌ఎస్‌ పార్టీ భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలాగే.. ఇవాళ ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ ధర్నా కు దిగింది.

ఈ ధర్నాలో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ తో పాటు రైతు సంఘాల అధ్యక్షుడు రాకేష్‌ టికాయత్‌ కూడా పాల్గొన్నారు. కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమాన్ని రగిలించారు రాకేష్‌ టికాయత్‌. అయితే.. అలాంటి వ్యక్తి కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహిస్తోన్న ధర్నాకు రావడం సంచలనంగా మారింది. ఇక ఈ మహా ధర్నాకు.. తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు అందరూ వచ్చారు. దేశ రాజధాని మొత్తం గులాబీ మయం అయింది. తెలంగాణ పండేటువంటి ప్రతి గింజాను కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో ఈ ధర్నా చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news