ప్రత్యేక విమానం కొనుగోలు చేస్తున్న సీఎం కేసీఆర్

-

జాతీయ పార్టీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి రంగం సిద్ధం చేశారు. దసరా రోజున పార్టీ గురించి కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం రోజున టీఆర్ఎస్ పార్టీ ఓ కీలక ప్రకటన చేసింది. అదేంటంటే.. టీఆర్ఎస్ అదినేత దేశవ్యాప్త పర్యటనలు ముమ్మరం చేయనుండటం వల్ల ఆయన ఓ ప్రత్యేక విమానాన్ని కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం రూ.80 కోట్లు వెచ్చించేందుకు ఆ పార్టీ సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. 12 సీట్లతో కూడిన ఆవిమానం కొనుగోలుకు దసరారోజు ఆర్డర్‌ ఇవ్వాలని గులాబీ పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది.

దసరారోజు కొత్త పార్టీపేరు ప్రకటన తర్వాత ప్రత్యేక విమానం కొనుగోలుకు ఆర్డర్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ ఖజానాలో ఇప్పటికే రూ.865 కోట్ల మేర నిధులున్న విమానం కొనుగోలుకు విరాళాలు సేకరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రస్తుతం వివిధ రాష్ట్రాల పర్యటనలకు ప్రైవేటు విమానాలు అద్దెకు తీసుకొని వినియోగిస్తున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు దృష్ట్యా సొంతవిమానం అవసరమనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news