ఎంపీ ఒవైసీతో సీఎం కేసీఆర్‌.. ఫోటో వైరల్‌

-

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…. మైనారిటీల సంక్షేమానికి రూ.12 వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. తెలంగాణ ముందుకు వెళుతోంది… దేశం వెనుకబడిపోతోంది అని వ్యాఖ్యానించారు.

కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. దేశాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలుగా పాటుపడతామని తెలిపారు. ఆవేశంతో కాకుండా, ఆలోచనతో దేశాన్ని పరిరక్షించుకుందామని అన్నారు. అయితే. ఈ సందర్భంగా ఎంపీ ఒవైసీకి రంజాన్‌ శుభాకాంక్షలు చెబుతూ… ఆయనకు స్వీట్‌ తినిపించారు సీఎం కేసీఆర్‌. దీనికి సంబంధించిన ఫోటో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news