రోడ్డు మార్గాన నిర్మల్ చేరుకున్న సీఎం కేసీఆర్

-

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు నిర్మల్ జిల్లాకు చేరుకున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గాన ఆయన నిర్మల్ కి చేరుకున్నారు. అక్కడ నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భావన సముదాయాన్ని ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు. నిర్మల్ కి చేరుకున్న సీఎం కేసీఆర్ నేరుగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటికి వెళ్లారు.

ఇక అక్కడి నుండి బయలుదేరి మరికాసేపట్లో నిర్మల్ బిఆర్ఎస్ పార్టీ ఆఫీసు భవనాన్ని, నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఎల్లంపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. కెసిఆర్ పర్యటన సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రం గులాబీ మయంగా మారింది. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news