యాద‌య్య నాకు ఓ విచిత్ర‌మైన దోస్తు.. ఆయ‌న నాకే ఆర్డ‌ర్ ఇస్తారు : సీఎం కేసీఆర్

-

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాద‌య్య నాకు ఓ విచిత్ర‌మైన దోస్తు.. ఆయ‌న త‌న‌కే ఆర్డ‌ర్ వేస్తార‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలిపారు. చేవెళ్ల నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని, కాలే యాద‌య్య‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ మాట్లాడారు.
యాద‌య్య నాకు ఓ విచిత్ర‌మైన దోస్తు. నేనేమో అంద‌రికీ ఆర్డ‌ర్ ఇస్తాను. యాద‌య్య నాకు ఆర్డ‌ర్ ఇస్తారు. నా ద‌గ్గ‌రోడు కాబ‌ట్టి.. నేను రాగానే అడుగుతా ఎమ్మెల్యే సాబ్ ఏం ఆర్డ‌ర్ అని. చేసిన దాకా ఊకోడు.

ప‌ట్టుబ‌డుతాడు మొండిగా. ఈసీ వాగు, మూసీ వాగు మీద బ్రిడ్జిలు కావాల‌ని న‌న్ను, ఆ మంత్రులు ఆగ‌మాగం ప‌ట్టించిండు. అవ‌స‌రం ఉన్న‌ది.. జ‌నం పెరిగింది మాకు, గ్రామాల‌కు రాక‌పోక‌లు పెరిగాయి, కంప‌ల్స‌రీ నాకు బ్రిడ్జిలు కావాల‌ని ప‌ట్టుబ‌ట్టిండు. ఆ పంచాయ‌తీ రాజ్, ఆర్ అండ్ బీ మినిస్ట‌ర్స్ అయితే చ‌చ్చే ప‌రిస్థితి అయింది వాళ్ల‌కు. అంత వెంబ‌డి ప‌డి తెచ్చిండు. యాద‌య్య చీమ‌కు, దోమ‌కు కూడా న‌ష్టం చేసే మ‌నిషి కాదు. తోచిన కాడికి ప‌ని చేస్త‌డు త‌ప్ప ఏ మ‌నిషికి న‌ష్టం చేయ‌డు అని కేసీఆర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news