నేను బూతులు మాట్లాడతా.. ఆ బూతులు ప్రసారం చేస్తే జైల్లో వేస్తా – రేవంత్ రెడ్డి

-

నేను బూతులు మాట్లాడతా.. ఆ బూతులు ప్రసారం చేస్తే జైల్లో వేస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు బూతులు మాట్లాడితే.. మీడియా వాటిని ప్రసారం చేయకూడదని కోరారు. ఓ ఛానెల్‌ లో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ…కేసీఆర్‌ ఏమన్నా ఆయన మాటలకు విలువ లేదని ఫైర్‌ అయ్యారు.

తెలంగాణ జాతిపిత అంటే కొండా లక్ష్మణ్‌ బాపూజీ, ప్రొ.జయశంకర్‌ మాత్రమే.. కేసీఆర్‌.. పక్కా చౌకబారు రాజకీయ నాయకుడని విమర్శలు చేశారు. జాతిపిత అనే పదం కేసీఆర్‌కు సూట్‌ కాదు.. కాంగ్రెస్‌కు 14 సీట్లు వస్తే.. ఆ గొప్పతనం కేసీఆర్‌ది అనుకుంటే మాకు అభ్యంతరం లేదన్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తామన్నారు.  100 రోజుల పరిపాలన చూసే తీర్పు ఇవ్వాలని కోరుతున్నాం.. 100 రోజుల్లోనే అన్నీ అయిపోవాలంటే ఎలా? అంటూ ఆగ్రహించారు సీఎం రేవంత్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news