కాంగ్రెస్ నాయకులు జోకర్లు – ఎమ్మెల్యే సైదిరెడ్డి

-

తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పై తీవ్ర విమర్శలు చేశారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి. కాంగ్రెస్ నాయకులు జోకర్లని అన్నారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ నేతలు పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావన్నారు. కాంగ్రెస్ నాయకులకు సభ్యత సంస్కారం లేదని.. వాళ్లను ఓడించడానికి మేము అవసరం లేదు.. వాళ్లే ఓడించుకుంటారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ఇక మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. నల్గొండ కాంగ్రెస్ నేతలు సన్నాసులు, చవటలు అని విమర్శించారు. వారు ఊర కుక్కలు, పిచ్చికుక్కల్లాగా మాట్లాడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఒక బ్రోకర్ అని వ్యాఖ్యానించారు. మునుగోడు ఉప ఎన్నికలలో కోమటిరెడ్డి తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి కోసం పనిచేశారని ఆరోపించారు. కాంగ్రెస్ లో అందరూ సీఎం లేనని.. ఒక్కరు కూడా ప్రజల్లో గెలవరని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news