రేపు గవర్నర్ గా ప్రమాణం చేయనున్న సీపీ రాధాకృష్ణన్

-

తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. గవర్నర్ తమిళి సై రాజీనామాకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆమె స్థానంలో ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్న సీపీ రాధాకృష్ణన్కు బాధ్యతలు అప్పగించింది. తెలంగాణతో పాటు తమిళి సై చూసిన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలను కూడా ప్రెసిడెంట్ రాధాకృష్ణన్కే అప్పజెప్పిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు పూర్తి స్థాయి గవర్నర్ను నియమించే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, తెలంగాణ గవర్నర్ నియామకమైన రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు అయింది.

రేపు ఆయన తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఇవాళ రాత్రి ఆయన జార్ఖండ్ నుండి హైదరాబాద్కు చేరుకోనున్నారు. బుధవారం ఉదయం 11.15 నిమిషాలకు ఆయన రాజ్ భవన్లో గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్ చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news