సీఎం జగన్ కి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ

-

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి వద్ద జర్నలిస్టులపై దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేసి, కఠిన చర్యలు చేపట్టాలని కోరుతూ లేఖ రాశారు రామకృష్ణ. మీడియా ప్రతినిధులను లాక్కెళ్ళి హోటల్లో పడేసి తీవ్రంగా కొట్టడం దుర్మార్గం అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే పత్రిక/మీడియా ప్రతినిధులపై దాడులు అమానుషం అని పేర్కొన్నారు.

ఏపీయూడబ్ల్యూజే నేతలు అడిషనల్ ఎస్పీని కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ దుండగులను పట్టుకోలేదని మండిపడ్డారు. తక్షణమే ఆసుపత్రి వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news