జగిత్యాలలో దారుణం..ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురికి గుండు కొట్టించిన తల్లిదండ్రులు

-

జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురుని కిడ్నాప్ చేసి గుండు కొట్టించారు తల్లిదండ్రులు. పెళ్లి అయిన ఏడు నెలల తర్వాత కూతురు పట్ల తల్లిదండ్రులు ఇలా కర్కశంగా ప్రవర్థించారు. జగిత్యాల జిల్లా రూరల్ మండలం బాలపల్లికి చెందిన జక్కుల మధు (23)రాయికల్ మండలం ఇటిక్యాల కు జువ్వాజి అక్షిత (20)లు ప్రేమ వివాహం చేసుకున్నారు.

అయితే… అత్తింటి వారి ఇంటి నుండి యువతిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు చేసి శిరోమండనం చేశారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కట్టుకున్నోడు కావాలంటూ స్టేషన్ మెట్లు ఎక్కింది ఆ యువతి. ఇక ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు న్యాయం చేస్తామని యువతికి హామీ ఇచ్చారు. దీంతో ఈ ఘటన జగిత్యాల జిల్లాలో సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news